Saturday 19 October 2019

SAERA NARASIMHAREDDY.


Generally, movies dramatize the actual happenings and create heroes, when there were none. The movie made on the life of Uyyalawada Narasimhareddy is releasing on October 2nd , and it is one such. It distorts history and presents him as a freedom fighter. As per history he simply rebelled against the English only because he was granted a measly pension by them. Let us have a look at his life and the background.

In a kingdom or a Nawabaite as in the case of Nizam, those who served as vassals of the king, his commanders, and his rich and influential courtiers who owned lands were used by the Kings as intermediaries between him and the farmers. The intermediaries also had administrative powers and functioned as virtual kings of their small areas. In the coastal Andhra area, those functionaries were known as Jamindars, in Telengana as Sardesmukhs, Deshmukhs & Jagirdars and in Rayalaseema  as Polygars.

When the kingdoms disintegrated, and the British took over, initially they continued with the same set of Jamindars. However, later some changes were made in the revenue system that worked against these classes. In the Rayalaseema area Thomas Munro came in 1800 AD as the collector and introduced revenue reforms.

Till then as there was no central authority the Polygars, and Jamindars had no check as to what is extent of tax that is to be paid. Some of the Jamindars and most of the Polygars were indulging to it in excess and made the people suffer. When Munro tried to bring in a new set of rules to check them, these Jamindars rebelled.

Another big problem is the way in which the Jamindars have been treated by the English. The English had no idea of the local customs or the language and offended the Jamindars often. On top of that they looked at most of the Indians with a condescending and insulting attitude which made matters worse, and there was discontent even among the common people. This made the Jamindars more antagonistic to the British.

There were a series of uprisings against the British in the Circar areas.  The first one was by the Jamindars of Parlakimidi from 1765 onwards, and then by the Jamindar of Ghumsur, Bhanjadeo in 1778. Then came the turn of the Raja of Vijayanagaram, Vijayaramaraju in 1794.

When the Circars were ceded to the English in 1802 by the Nizam there were over 80 Polygars in Rayalaseema with about 30,000 soldiers between them. Their rule however, was very oppressive and they were exploiting the people badly. As their areas were given to the company, they defied its authority and refused to pay the Peshcush.

At that time the Collector of Rayalaseema was Sir Thomas Munro who was to later become the Governor of Madras Presidency in 1820. He was an extremely able man who could converse freely in Telugu and is very sympathetic towards the oppressed farmers. The Polygars unitedly tried to defy the British but Munro brought them to heel in 2 years time, demolished all their forts and pensioned them off. Even the oppressed farmers aided Munro in this war. By the time Munro relinquished his office in 1807 as the Collector of Rayalseema, it became totally free from Polygars.  

But the descendant of Uyyalawada family Narasimhareddy of Cuddapah was not satisfied with the pension of just Rs 11 per month given to him by the company and rebelled in 1846. He assembled an army of 5,000 soldiers and looted the villages of Rudravaram, Krishnamsettipalle, Mundlapadu etc. as well as the Koilkuntla taluqa treasury. After that his army marched on to Giddalur where he was defeated by the British but Reddy escaped into the Nallamala hills with a small band of followers. Ultimately the English caught him at Persomella hill and imprisoned him. He was hanged in 1847.

So Narasimhareddy fought for his own problems and not for freeing India as the movie depicts him to be. It is to be noted that his loot did not stop with the English but it also encompassed villages where poor farmers lived. Not only that, Narasimhareddy did not die in battle and escaped but was caught later. But to his credit he troubled the English till he was killed.

ఆంధ్ర దేశంలో జరిగిన ముఖ్య జమిందారీ తిరుగుబాట్లు.


మధ్యనే సైరా నరసింహారెడ్డి సినిమా విడుదల అయ్యింది. అందులో ఆయన మొదటి స్వతంత్ర పోరాటం చేసాడు అని చెప్పబడింది. నరసింహారెడ్డి  బ్రిటిష్ వారి మధ్య యుద్ధం 1848  సంవత్సరం లో అయ్యింది. అంతే కాదు నరసింహారెడ్డి చేసిన పోరాటం స్వతంత్రం కోసం కాదు, ఆయనకు ఇచ్చిన అతి తక్కువ పెన్షన్ అయిన నెలకు 11  రూపాయలు పెంచుకోవడం కోసం. అయన ఎప్పుడూ భారత్ దేశానికి బ్రిటీష్ వారి నుండి స్వతంత్రం కోరలేదు. తనకు బ్రిటిషువారినుండి అన్యాయం జరిగింది అని పోరాటం చేసాడు అంతే. అంతే కాదు, నరసింహారెడ్డి పేద ప్రజలు జీవించే 4 -5  గ్రామాలను కొల్లగొట్టాడు కూడా. 

కానీ ఆయనకంటే ముందే బ్రిటిష్ వారితో పోరాటం సలిపిన అనేక భారతీయులు ఆంధ్ర దేశీయులు, తెలుగువారు ఉన్నారు. అందులో ముఖ్యుడు అయిన వీరపాండ్య కట్టబొమ్మన్ పేరు మీరు వినే ఉంటారు. కట్టబొమ్మన్ ను బ్రిటిష్ వారు మొదటి పాళెగార్    యుద్ధంలో 1800  సంవత్సరంలో ఓడించారు. విజయనగర సామ్రాజ్యం లోని జమిందార్,రాజా లను పాళెగార్ అని పిలిచేవారు. ఇందులో ఆంధ్ర దేశంలో బ్రిటిష్ వారితో జరిగిన మొదటి ముఖ్య తిరుగుబాటులను గురించి రాస్తున్నాను. సైరా సినిమా విడుదల కాగానే  నూజివీడు రాజా నారయ్యప్పారావు గారి మీద ఒక వీడియో సోషల్ మీడియా లో వచ్చింది. అందుకే నోట్ రాద్దాము అని నాకు అనిపించింది.

నూజివీడు రాజా మేకా నారయ్యప్పారావు  గారి తిరుగుబాటు.

కట్టబొమ్మన్ కంటే కూడా ముందు 1778-83  లో నూజివీడు రాజా అయిన మేకా నారయ్యప్పారావు గారు బ్రిటిష్ వారి మీద తిరుగుబాటు చేసారు. బ్రిటిష్ వారు మొదటిగా నారాయప్పరావు గారి  పూర్వీకులు అయిన వెంకయ్య అప్పారావు గారి నుండి దివి పరగానా కు చెందిన బందరు లో కోట కట్టుకొనుటకై అనుమతి పొందారు. వారు క్రమముగా బలవంతులు అయ్యి నిజాం నుండి ఉత్తర circar లు  పొందారు. బ్రిటిష్ వారి బలము పెరగడం వలన వారు సహజంగా జమీందారులు మీద సామంత రాజులు మీద తమ ఆధిపత్యం అధికంగా ప్రకటించటం మొదలు పెట్టారు.

దానితో అసమ్మతిఁ చెంది కొంత మంది జమీందారులు తిరుగుబాటు చేసారు. అందులో ముందు 1778-83  సంవత్సరంలో నారయ్యప్పారావు గారు, తరువాత 1794  లో విజయనగర రాజు  అయిన  చిన విజయరామరాజు చేసిన తిరుగుబాట్లు పెద్దవి.

బ్రిటిష్ వారు బలపడి కొంత కాలం తరువాత నూజివీడు సంస్థానం స్వాధీనపరచుకొనుటకు చూసిరి. అది సహించక నారయ్యప్పారావు గారు బ్రిటిష్ వారికి  కప్పము కట్టడం నిలిపివేసిరి. అందుకు కోపించి బ్రిటిష్ వారు 1783  సంవత్సరంలో కల్నల్ మౌంట్ గోమరీ నాయకత్వంలో నూజివీడు కోటను ముట్టడించిరి.అయన క్రింద ఇద్దరు మేజర్ లు, ఆరుగురు lieutenant లు బ్రిటిష్ సేనలను నడిపిరి.  

బ్రిటిష్ దళాలు 21  రోజులు కోటను ముట్టడించి ఉన్నాయి. కానీ వారు కోటను ఆక్రమించటానికి వెనుకాడారు ఎందుకంటే దగ్గరలోనే పాల్వంచ జమీందారు అయిన రామచంద్ర అశ్వారావు గారు సేనతో నూజివీడు కు సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు అని వారికి తెలిసింది. ఒకవేళ కోటను ఆక్రమించటానికి ప్రయత్నం చేస్తే  వెనుకనుండి పాల్వంచ సేనలు తమను ముట్టడిస్తాయి అని, అప్పుడు తాము రెండు సైన్యాల మధ్య చిక్కుకుని అపార నష్టం పొందుతాము అని వారికి అనిపించింది..

21  రోజున నారయ్యప్పారావు గారు కోటలో సభ జరిపి సమాలోచన చేసిరి. అప్పటికి బొబ్బిలి యుద్ధం జరిగి కేవలం 26  సంవత్సరాల కాలం మాత్రమే అయ్యింది. అక్కడ జరిగిన ప్రాణ నష్టం అందరి మదిలోను మెదిలింది. బ్రిటీష్ వారిని ముట్టడిస్తే అపార ప్రాణ నష్టం తప్పదు అని చెప్పి, వారికి లొంగకుండా కోటలో నుండి తప్పుకొనుట మంచిది అని నిర్ణయానికి వచ్చారు. తరువాతి రోజు తెల్లవారుజామున వ్యూహం ప్రకారం కోట పశ్చిమ గోడను ఫిరంగి తో ఛేదించి 10 ,000  మంది వెంట రాగా నారయ్యప్పారావు గారు బ్రిటిష్ సేనలను చీల్చుకుని Sunkollu  అడవి ని చేరి, అక్కడ ఉన్న రామచంద్ర అశ్వారావు గారి సేనతో కలిసి భద్రాచలం ప్రాంతానికి వెడలిరి. పోరాటం లో ఒక బ్రిటిష్ lieutenant మరియు 194  మంది బ్రిటిష్ సైనికులు మరణించారు.

భద్రాచలం కొండ ప్రాంతం అవటం వలన, ప్రజలు నారయ్యపారావు గారు, అశ్వారావు గార్ల పక్షం అందటం వలన బ్రిటిష్ వారు ఆయనను ఏమీ చేయలేకపోయారు. చివరికి రాజముండ్రి కలెక్టర్, మైలవరం జమీందార్లు వారితో మంతనాలు సలిపి రాజీకి తెచ్చి నారయ్యపారావు గారి కుమారుడు అయిన వెంకట నరసింహ అప్పారావు ( ధర్మ అప్పారావు)  గారికి  సంస్థానం అప్పగించిరి. ఈయనకు లార్డ్ క్లయివ్ స్వయంగా శాశ్వత sannadu ( సంస్థానాన్ని పాలించడానికి అధికారం  )  ఇచ్చెను. 


విజయనగర రాజా చిన విజయరామరాజు తిరుగుబాటు.

తరువాతి పోరాటం విజయనగర సంస్థానం నుండి జరిగింది. ముందుగా తండ్రి మరణించే సమయానికి చిన విజయరామరాజు చిన్న బాలుడు కావటం వలన అతని సవతి అన్న అయిన సీతారామరాజు జమిందారికి దివాన్ అయ్యి పాలించాడు  ఆతను మహా క్రూరుడు.  1759 -68  మధ్య ఉన్న అరాజక పరిస్థితులు ఆధారంగా చేసుకుని అతను గంజాం, విశాఖపట్నం (ప్రస్తుత విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు ) జిల్లాల లోని అందరు జమిందారులను ఓడించి కారాగారంలో బంధించి నిరంకుశంగా పాలన చేసాడు. అప్పటికి కేవలం గంజాం జిల్లాలోనే ఏకంగా 35 ,000  మంది సైన్యం, 34 కోటలు కలిగిన 20  మంది జమీందార్లు ఉన్నారు. అందులో పర్లాకిమిడి, ఘున్సూర్, మొహిరి, ప్రతాపగిరి జమీందార్లు అనేక పర్యాయాలు బ్రిటిష్ వారి మీద తిరుగుబాటు చేసారు. వారందిరినీ సీతారామరాజు ఓడించాడు.

సీతారామరాజు పాలన ను ప్రజలు కూడా ఏవగించుకున్నారు. విజయనగర బలం పెరిగి 1768  సంవత్సరానికి విజయనగర జమిందారును కాదని పాలించడం బ్రిటిష్ వారికి కష్టం అయిపొయింది. చిన విజయరామరాజు పెద్దవాడు అయ్యి సీతారామరాజు ని దివాన్ పదవి నుండి తొలగించాడు. దానికి కోపగించి సీతారామరాజు బ్రిటిష్ వారితో చేతులు కలిపాడు.

బ్రిటిష్ వారు విజయనగర peshcus  పెంచడానికి, విజయనగర సైన్యాన్ని తగ్గించడానికి వారు బాకీ పడ్డ 8,50,000  peshcush  రొక్కం వసూలు చేయడానికి ప్రయత్నించారు. తాను బ్రిటిష్ వారికి peshcush  బాకీ పడలేదు అని విజయనగర జమీందారు నిరూపించాడు కానీ అది లెక్కపెట్టకుండా బ్రిటిష్ వారు విజయనగరాన్ని ఆక్రమించారు. కానీ జమీందారు మీద భక్తి ఉన్న రైతులు బ్రిటిష్ వారికి శిస్తు కట్టడానికి నిరాకరించారు. దానితో బ్రిటిష్ వారు జమిందారుకు నెలకు 1200 రూపాయలు పెన్షన్ గా నిర్ణయించి జమిందారును మచిలీపట్టణం వెళ్లిపోవలసింది గా ఆదేశించారు. జమీందారు ఆదేశాలు మన్నించక 1794  సంవత్సరం లో బ్రిటీష్ వారితో పద్మనాభం దగ్గర యుద్ధం చేసి వధించ పడ్డాడు.

జమీందారు మరణం తరువాత జమీందారు కొడుకు అయిన నారాయణబాబు విశాఖ మన్యం లోని మక్కువ ప్రాంతం లో తల దాచుకున్నాడు. అక్కడ అతనికి కొండ దొరలు, భక్తులు అయిన సర్దారులు తోడ్పడ్డారు. 1802 సంవత్సరంలో నారాయణబాబు కు బ్రిటిష్ వారికి సంధి జరిగింది. దాని ప్రకారం నారాయణబాబు బ్రిటిష్ వారికి 6,00,000  రూపాయలు peshcush  చెల్లించాడు. బ్రిటిష్ వారు నారాయణబాబు కు అతని సంస్థానం తిరిగి ఇచ్చారు. 

Saturday 24 August 2019

వెలమల చరిత్ర ఆరంభం- కాకతీయ సామ్రాజ్యం.


పల్నాటి యుద్ధం క్రిస్తు శకం 1178 -82  మధ్యలో జరిగింది. అందులో బ్రహ్మనాయుడు రేచెర్ల గోత్రజుడైన వెలమ దొర  అని చెప్పబడింది. ఆ తరువాత క్రిస్తు శకం 1199 లో రాజ్యానికి వచ్చిన గణపతిదేవుని కొలువులో పద్మనాయక వెలమలు ముఖ్య పాత్ర పోషించారు.

అలాగే వారు అయన వారసులు ఐన రుద్రమదేవి, ప్రతాపరుద్రుని కొలువులో ముఖ్యపాత్రలు పోషించారు. వారు కాకతీయ సామ్రాజ్య విచ్చిన్నం తరువాత నల్గొండ లోని రాచకొండ రాజధానిగా చేసుకుని స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించారు.        

వెలమల చరిత్ర కాకతీయ సామ్రాజ్యంతో ఘాడంగా ముడిపడి ఉంది. అందుచేత వెలమ చరిత్రకు కాకతీయ సామ్రాజ్య చరిత్ర మూలం. ఇక్కడ కాకతీయ సామ్రాజ్య చివరి చరిత్ర క్లుప్తం గా  పరిశీలిద్దాము. 

రాణి రుద్రమ దేవి కి కొడుకులు లేరు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వారు రుయ్యమ, రుద్రమ మరియు ముమ్మిడమ్మ. ముమ్మిడమ్మ పుత్రుడు ప్రతాపరుద్రుడు. ఆయనను రుద్రమదేవి దత్తత స్వీకరించి తన తరువాత కాకతీయ సామ్రాట్ చేసింది. ప్రతాపరుద్రుని కాలం లో కాకతీయ సామ్రాజ్యం ఉచ్చ స్థితిని చేరింది, కానీ తరువాత అది ముక్కలుగా విడిపోవడం కూడా ప్రారంభం అయ్యింది. ప్రతాపరుద్రుడు తన రాజ్యం లోనే వెలమ రెడ్డి, కాయస్థ రాజుల తిరుగుబాటులను ఎదుర్కోవలసి వచ్చింది.

నాయంకర విధానాన్ని ప్రతాపరుద్రుడు ప్రక్షానలం చేసి సామ్రాజ్యాన్ని 77  నాయంకరాలు గా విడతీసి వాటిని తనకు విశ్వాసపాత్రులైన సైన్యాధిపతులకు అప్ప చెప్పాడు. ప్రక్షానలం లో వాటిలో ఎక్కువ నాయంకరాలు వెలమలకు ఇవ్వబడటం వల్ల అప్పటి స్థానిక  చరిత్రల ప్రకారం రెడ్డి సైన్యాధిపతులకు కోపం వచ్చింది.

1303 -1310  సమయ లో కాకతీయ సామ్రాజ్యం మీద ముస్లిం దండయాత్రలు జరిగాయి. అది అదనుగా చూసుకుని గండికోట సామంత రాజు ఐన వైదుంబ మల్లిదేవుడు మరియు నెల్లూరు రాజైన రంగనాథుడు స్వతంత్రం ప్రకటించారు. అప్పుడు కాకతీయ సైన్యాలు జుట్టాయిలెంక  గొంకారెడ్డి నాయకత్వం లో మల్లిదేవుని తిరుగుబాటు అణచి గండికోట ను స్వాధీనం చేసుకున్నాయి.

ఇంతలో పాండ్య రాజ్యం లో అంతః కలహాలు చెలరేగాయి. అది అదనుగా చూసుకుని ప్రతాపరుద్రుడు సైన్యంతో పాండ్యులను ముట్టడించారు. యుద్ధం లో ప్రతాపరుద్రుని సైన్యాధిపతులు  ఐన ముప్పిడి నాయక, పెదరుద్ర, రేచెర్ల ఎర దాచానాయక మరియు దేవరినాయకులు ముఖ్య భూమిక పోషించారు.

కాకతీయ సామ్రాజ్యం పైన ముస్లిం మొదటి దండయాత్ర 1303  సంవత్సరం లో జరిగింది.ఢిల్లీ సుల్తాన్  అయిన అల్లాఉద్దీన్ ఖిల్జీ తన సైన్యాధిపతి మాలిక్ ఫ్యాక్రుద్దిన్ జునా ను ఒక పెద్ద సైన్యంతో ఓరుగంటిని ముట్టడించడానికి పంపాడు. సైన్యాన్ని వెలమ నాయకులు ఐన రేచెర్ల వెన్నమనాయక మరియు పోతుగంటి మైలి ఉప్పరపల్లి దగ్గర ఓడించారు. 

తిరిగి 1309  లో అల్లాఉద్దీన్ ఖిల్జీ మాలిక్ కాఫర్ ను ఓరుగంటిని ముట్టడించడానికి పంపాడు. యుద్ధంలో ప్రతాపరుద్రుడు ఓడి సంధి చేసుకున్నాడు. అల్లాఉద్దీన్ ఖిల్జీ మరణించగానే ప్రతాపరుద్రుడు ఢిల్లీ కి కడుతున్న కప్పం చెల్లించడం ఆపేసాడు.

అప్పుడు ముబారక్ ఖిల్జీ ఖుస్రో ఖాన్ కి సైన్యం ఇచ్చి ఓరుగంటిని ముట్టడించడానికి పంపాడు. యుద్ధం లో ఏమి జరిగిందో చారిత్రక ఆధారాలు లేవు. కానీ అమిర్ ఖుస్రో ప్రకారం ప్రతాపరుద్రుడు యుద్ధంలో ఓడించబడి పెద్ద మొత్తం ఢిల్లీ సుల్తానుకు చెల్లించాడు.

కాకతీయ సామ్రాజ్యం మీద చివరి ముస్లిం దండయాత్ర సుల్తాన్ ఘియాజుద్దీన్ తుగ్లక్ సమయంలో 1321 -22  లో జరిగింది. ముస్లిం సైన్యాలు వచ్చి యువరాజు అయిన జునా ఖాన్ లేదా ఉలుఘ్ ఖాన్ లేదా మహమ్మద్ బీన్ తుగ్లక్ సారధ్యంలో ఓరుగంటిని ముట్టడించాయి. ముట్టడి 6  మాసాలు సాగినా సరే  ముస్లిం సైన్యాలు గెలవలేక పోయాయి. ఇంతలో ముస్లిం గుడారాల్లో ఢిల్లీ సుల్తాన్ చనిపోయాడు అని ఒక పుకారు పుట్టింది. అది చూసి ఇద్దరు ముస్లిం సైన్యాధిపతులు తిరుగుబాటు చేసి ప్రతాపరుద్రుని తో మంతనాలు చేసారు. దాని వలన ఉలుఘ్ ఖాన్ సైన్యం వేణు తిరగవలసి వచ్చింది. తిరోగమనం చేస్తున్న ముస్లిం సైన్యాలను ప్రతాపరుద్రుని సైన్యం వెంబడించి గొప్ప నష్టం కలిగించింది.

ఉలుఘ్ ఖాన్ దేవగిరి దుర్గానికి తిరోగమించి అక్కడ కొత్త సైన్యం కోసం నిరీక్షించాడు. ఢిల్లీ నుండి సైన్యం రాగానే ఉలుఘ్ ఖాన్ తిరిగి ఓరుగంటిని ముట్టడించాడు.  ఇంతలో ప్రతాపరుద్రుని సైన్యం లో కుల బేధాలు పెరిగి పోయాయి. రెడ్డి సైన్యాధిపతులకు కాకతీయుల మీద వెలమ సైన్యాధిపతుల మీద కోపం వచ్చింది. దానికి తోడు వారి అశ్వ దళం కానీ ఫిరంగులు కానీ ముస్లిం సైన్యాల వాటికి దీటు అయినవి కాదు.

పులి మీద పుట్ర లా సంకుల సమరం జరుగుతుండగా బొబ్బా రెడ్డి అనే సైన్యాధిపతి తన సైన్యాన్ని యుద్ధ భూమి నుండి వెనక్కు తీసుకున్నాడు. కాకతీయ సైన్యం ఓడిపోయింది. అనేక మంది ప్రతాపరుద్రుని సైన్యాధిపతులు యుద్ధం లో అసువులు కోల్పోయారు. ప్రతాపరుద్రుడు ముస్లిం సైన్యాలకు బందీగా చిక్కి అవి ఆయనను ఢిల్లీ తీసుకుని పోతుండగా నర్మదా నది లో దూకి ఆత్మ హత్య చేసుకున్నాడు.